Andhra Pradesh: వేగంగా వెళుతూ పల్టీ కొట్టిన కారు.. ఘటనాస్థలంలోనే ఎమ్మార్వో మృతి!

  • ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘటన
  • అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
  • ప్రాణాలు కోల్పోయిన బనగానపల్లి ఎమ్మార్వో

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పడంతో ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. ఈ దుర్ఘటనలో బనగానపల్లి ఎమ్మార్వో విష్ణువర్ధన్‌రెడ్డి(48) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గుత్తి నుంచి అనంతపురం వైపు విష్ణువర్ధన్ రెడ్డి కారులో బయలుదేరారు.

అయితే మార్గమధ్యంలో గుడ్డాలపల్లి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పింది. పల్టీ కొడుతూ పక్కనే ఉన్న తోటలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో విష్ణువర్ధన్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News