Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో ఇద్దరు యంగ్ హీరోలు

  • సెట్స్ పైకి అల్లు అర్జున్ 19వ సినిమా
  • కథానాయికగా పూజా హెగ్డే 
  •  కీలకమైన పాత్రలో 'టబు'

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఈ రోజునే పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రోజునే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, 'టబు' ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల కోసం ఇద్దరు యంగ్ హీరోలను తీసుకున్నట్టుగా సమాచారం.

ఆ ఇద్దరిలో ఒకరు నాగార్జున మేనల్లుడు సుశాంత్ అయితే, మరొకరు నవదీప్. హీరోగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సుశాంత్ కి హిట్ పడలేదు. ఇక నవదీప్ కి కెరియర్ ఆరంభంలో ఒకటి రెండు సక్సెస్ లు వచ్చినా, ఆ తరువాత ఆయనకి అవకాశాలే లేకుండాపోయాయి. అలాంటి ఈ హీరోలిద్దరకీ ఈ సినిమాలో అవకాశం రావడం విశేషం. అమాయక చక్రవర్తి పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడట. ఇక నవదీప్ పాత్ర ఎలా ఉంటుందనేది తెలియాల్సి వుంది. ఇక మిగతా పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. రావు రమేశ్ కనిపించనున్నారట. 

More Telugu News