Telangana: చిల్లరగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై కేసులు లేవా?: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారు
  • ఓ ముఖ్యమంత్రి తీరు ఇదేనా?
  • అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని రాజకీయం చేస్తారా?

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారని, చిల్లరగా వ్యవహరిస్తున్నారని, ఓ ముఖ్యమంత్రి తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీలో అధికారులను ఈసీ బదిలీ చేయడాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కేసులున్నాయని మాట్లాడుతున్న చంద్రబాబుపై కేసులు లేవా?  ఆ కేసుల్లో ‘స్టే’ తెచ్చుకోలేదా? అని  ప్రశ్నించారు.

More Telugu News