Kurnool District: టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైసీపీ నేతల ఆరోపణ.. కర్నూల్ వన్ టౌన్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

  • వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకుల దాడి ఆరోపణ
  • నిందితులను శిక్షించాలంటూ వైసీపీ నేతల డిమాండ్
  • వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లిన వైసీపీ నేతలు

కర్నూల్ లో వైసీపీ ఏజెంట్లపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డట్లు సమాచారం. దీంతో నిందితులను శిక్షించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వైసీపీ నేతలు వెళ్లారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, వైసీపీకి చెందిన ఇద్దరు ఏజెంట్లపై దాడికి పాల్పడింది టీజీ వెంకటేశ్ వర్గీయులని తెలుస్తోంది.

More Telugu News