belamkonda: స్టూవర్టుపురం పరిసర ప్రాంతాల్లో 'టైగర్ నాగేశ్వరరావు' షూటింగ్

  • బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'టైగర్ నాగేశ్వరరావు'
  • వచ్చేనెలలో 'స్టూవర్టుపురం'లో షూటింగ్
  •  కథానాయికగా పాయల్ రాజ్ పుత్    

బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సీత' సినిమా సిద్ధమవుతోంది. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ కథానాయికగా కనిపించనుంది. ఈ సినిమా తరువాత ఆయన వంశీకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమాతో దర్శకుడిగా వంశీకృష్ణ తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే.

 ఈ చిత్రానికి 'టైగర్ నాగేశ్వరరావు' టైటిల్ ను ఖరారు చేశారు. 1980 -90 మధ్య కాలంలో 'స్టూవర్టు పురం' గజదొంగగా ఆయన ప్రజలను భయకంపితులను చేశాడు. ఆయన బయోపిక్ గా రూపొందనున్న ఈ సినిమా, అదే 'స్టూవర్టుపురం' పరిసర ప్రాంతాల్లో వచ్చేనెలలో షూటింగు జరుపుకోనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ పేరు వినిపిస్తోంది.

More Telugu News