Chandrababu: ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్: జీవీఎల్

  • వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోంది
  • టీడీపీకి ఘోర పరాభవం తప్పదు
  • ఓటమి భయం వల్లే ఈసీని చంద్రబాబు టార్గెట్ చేస్తున్నారు

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభవం తప్పదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైసీపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని... జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. ఓటమి ఖాయమని తెలియడం వల్లే... ఆ నెపాన్ని ఎన్నికల సంఘంపై మోపేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈసీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ అని... ఎవరి ఆదేశాల మీదో అది నడవదని చెప్పారు. పోలింగ్ సమయంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినా... ఎన్నికల అధికారులు వెంటనే వాటిని సరిచేశారని తెలిపారు.

More Telugu News