Somireddy: అధికారులను బదిలీ చేయడమేనా ఈసీ పని?: నిలదీసిన సోమిరెడ్డి

  • ఈసీ పూర్తిగా వైఫల్యం చెందింది
  • పనికిరాని ఈవీఎంలు పంపారు
  • వైసీపీ దౌర్జన్యాలు చేస్తుంటే ఈసీ ఏం చేస్తోంది?

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోలింగ్ సందర్భంగా ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఈసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎస్, జిల్లా ఎస్పీలను, జిల్లా కలెక్టర్లను బదిలీ చేయడమా ఈసీ పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేస్తుంటే ఈసీ చూస్తూ ఊరుకుందే తప్ప చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఎంతో ఉత్సాహంగా ఓటేయడానికి ప్రజలు వస్తే ఈసీ అధికారులు పనికిరాని ఈవీఎంలు పంపి వాళ్ల ఉత్సాహాన్ని దెబ్బతీశారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం ఢిల్లీలో ఉండే ప్రధాని నరేంద్ర మోదీ అదుపాజ్ఞల్లో నడుస్తోందని ఆరోపించారు.

More Telugu News