cuddapah: రేపటి నుంచి ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

  • ఈ నెల 22 వరకు బ్రహ్మోత్సవాలు
  • బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
  • ఈ నెల 18న కోదండరాముని కల్యాణోత్సవం

కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో రేపటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ పూజలు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18వ తేదీన కోదండరాముని కల్యాణోత్సవం జరగనుంది. గత ఏడాది వర్ష బీభత్సం కారణంగా కల్యాణోత్సవ వేదిక దెబ్బతింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జర్మన్ షెడ్లతో కల్యాణ వేదికను సిద్ధం చేశారు.

More Telugu News