Bapatla: మతం చిదిమేసింది... బాపట్లలో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట!

  • ప్రేమించుకున్న తిరుపతి రెడ్డి, రిజ్వానా
  • పెళ్లికి ఒప్పుకోరన్న ఉద్దేశంలో ఆత్మహత్య
  • కేసును విచారిస్తున్న పోలీసులు

వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందిన వారు. ప్రేమించుకున్నారు. తమ ప్రేమ పెళ్లి వరకూ వెళ్లదన్న ఉద్దేశంతో తనువు చాలించారు. ఈ ఘటన బాపట్ల సమీపంలోని ఏట్రవారిపాలెంలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన అక్కల స్వామిరెడ్డి కుమారుడు తిరుపతిరెడ్డి (18), అదే గ్రామంలో టెన్త్ చదివిన షేక్‌ రెహ్మాన్‌ చిన్న కుమార్తె రిజ్వానా (16) గత సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు. బుధవారం రాత్రి గ్రామం నుంచి వెళ్లిపోయిన వీరిద్దరూ గురువారం గ్రామ శివార్లలోని తుంగభద్ర డ్రెయిన్‌ వద్దకు వెళ్లారు. తాము ప్రేమించుకున్నామని, పెళ్లి జరగదన్న ఆందోళనలో ఉన్నామని, ఎలుకల మందు తింటున్నామని కుటుంబీకులకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో భయపడ్డ ఇద్దరి కుటుంబ సభ్యులూ వెతుకగా, డ్రెయిన్ కట్టపై బైక్, సెల్‌ఫోన్, రిజ్వానా చున్నీలు కనిపించాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, గజ ఈతగాళ్లతో వెతికించగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. దీంతో కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News