saidharam tej: కొరటాల సూచనలు మా నమ్మకాన్ని పెంచాయి: సాయిధరమ్ తేజ్

  • విడుదలకి సిద్ధమవుతోన్న 'చిత్రలహరి'
  • ప్రతి ప్రేక్షకుడికి కథ కనెక్ట్ అవుతుంది]
  • మా నమ్మకం మరింత పెరిగింది  

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా 'చిత్రలహరి' సినిమా రూపొందింది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజు బిజీగా వున్నాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇంతకుముందు ఓ ఫ్లాప్ పడింది. అందరికీ కూడా ఈ సినిమా సక్సెస్ అవసరం. అందువలన ఈ సినిమా స్క్రిప్ట్ ను దర్శకుడు కొరటాల శివకి చూపించాము. స్క్రిప్ట్ విషయంలో కొరటాల సూచనలను తీసుకుని .. అక్షరాలా వాటిని ఆచరణలో పెట్టాము. కొరటాల ఇచ్చిన సూచనలు మాకెంతగానో ఉపయోగపడ్డాయి. ప్రతి ప్రేక్షకుడికి ఈ కథ కనెక్ట్ అయ్యేలా ఆయన శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందనే నమ్మకం .. ధైర్యం మాకు కలిగాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News