vaishnav tej: వైష్ణవ్ తేజ్ జోడీగా మేఘా ఆకాశ్

  • బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్
  •  ప్రాజెక్టు నుంచి వెళ్లిపోయిన మనీషా రాజ్
  •  ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి    

సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా మొదట మనీషా రాజ్ ను తీసుకున్నారు. తెలుగు తెరకి 'టూ కంట్రీస్' సినిమా ద్వారా ఈ అమ్మాయి పరిచయమైంది.

ఆ అమ్మాయినే వైష్ణవ్ తేజ్ సరసన ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి ఆ అమ్మాయిని తొలగించినట్టు తెలుస్తోంది. మనీషా రాజ్ స్థానంలో 'మేఘా ఆకాశ్' ను తీసుకోవాలని అనుకుంటున్నారట. 'లై' .. 'ఛల్ మోహన్ రంగ' ద్వారా తెలుగు ప్రేక్షకులకు మేఘా ఆకాశ్ పరిచయమే. ఆల్రెడీ ఆ అమ్మాయితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. మేఘా ఆకాశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనే అంటున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడనే సంగతి తెలిసిందే.

More Telugu News