West Godavari District: ఓటేశాక పోలింగ్‌ స్టేషన్‌లో కుప్పకూలిన వృద్ధుడు...ఆసుపత్రికి తరలించేలోగానే మృతి

  • పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం
  • దువ్వ పోలింగ్‌ కేంద్రంలో అపశ్రుతి 
  • ఎక్కువసేపు క్యూలో నిలబడడంతో ఇబ్బంది

సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు పోలింగ్‌ కేంద్రంలోనే కుప్పకూలి మృత్యువాతపడిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పశ్చిమగోదావరి జిల్లా దువ్వ పోలింగ్‌ కేంద్రంలోని బూత్‌ నంబర్‌ 15లో ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ కేంద్రంలో ఓటేసేందుకు బంగారు ముసలయ్య అనే వృద్దుడు వచ్చారు. భారీ క్యూ ఉండడంతో చాలాసేపు క్యూలో ఉండాల్సి వచ్చింది.

తన వంతు వచ్చేసరికి బూత్‌ లోపలికి వెళ్లిన ముసలయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరిగి వస్తుండగా కుప్పకూలిపోయారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు తక్షణం సపర్యలు చేసి ఆసుపత్రికి తరలించేలోపే అతను చనిపోయాడు. ఎక్కువసేపు క్యూలైన్లో నిల్చోవడం వల్లే ఆరోగ్యం దెబ్బతిని ఈ ఘటన చోటు చేసుకుని ఉండవచ్చునని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

More Telugu News