Andhra Pradesh: కర్నూలులో వైసీపీ-టీడీపీ స్ట్రీట్ వార్.. రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు!

  • అహోబిలంలో పోలింగ్ సందర్భంగా ఘటన
  • రెండు గ్రూపులను చెదరగొట్టిన పోలీసులు
  • ఘటనాస్థలికి అనుచరులతో కలిసి వచ్చిన అఖిలప్రియ

రాయలసీమలోని కర్నూలు జిల్లాలో ఈరోజు పోలింగ్ సందర్భంగా వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసుకున్నాయి. ఈరోజు అహోబిలంలోని పోలింగ్ బూత్ లోకి వెళ్లే క్రమంలో భూమా-గంగుల వర్గీయులు ఘర్షణ పడ్డారు.

ఇదికాస్తా ముదరడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. విషయం తెలుసుకున్న మంత్రి అఖిలప్రియ అనుచరులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

ఈ నేపథ్యంలో ఆమెకు సర్దిచెప్పిన పోలీస్ ఉన్నతాధికారులు వెనక్కి వెళ్లాల్సిందిగా కోరారు.  అయితే ముందుగా నిందితులపై చర్యలు తీసుకుంటేనే వెళతానని ఆమె స్పష్టం చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి అఖిలప్రియ వెళ్లిపోయారు.

More Telugu News