Eluru: ఏలూరులో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు!

  • ఏజంట్ల మధ్య వాగ్వాదం
  • వైసీపీ కార్యకర్తకు తీవ్రగాయాలు
  • ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు కూడా
  • చెదరగొట్టిన పోలీసులు

ఏలూరులో ఓ పోలింగ్ బూత్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. స్థానిక శనివారపుపేట ఇందిరాకాలనీ పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలింగ్ బూత్ ముందే ఏజంట్ల వద్ద వాగ్వాదం జరుగగా, రెండు పార్టీల వారూ ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ దాడుల్లో వైసీపీ కార్యకర్త మట్టా రాజుకు తీవ్రగాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు స్వల్పగాయాలు అయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలవారినీ చెదరగొట్టారు. కాగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలోనూ టీడీపీ, వైసీపీ వర్గాల ఏజంట్లూ, కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసులు కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

More Telugu News