Lokneeti-csds: ‘లోక్ నీతి-సీఎస్డీఎస్’ సర్వే పేరిట కథనం ఎఫెక్ట్.. ‘ఆంధ్రజ్యోతి’కి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు!

  • ‘లోక్ నీతి-సీఎస్డీఎస్’ సర్వేలో టీడీపీకే గెలుపని కథనం
  • ఈ సర్వే తమది కాదన్న ‘లోక్ నీతి-సీఎస్డీఎస్’
  •  వివరణ ఇవ్వాలని ‘ఆంధ్రజ్యోతి’కి నోటీసులు

ఈ ఎన్నికల్లో టీడీపీదే విజయమని ‘లోక్ నీతి-సీఎస్డీఎస్’ సర్వేలో తేలిందంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ఇటీవల ఓ కథనం వెలువడింది. ఆంధ్రాలో తాము ఎటువంటి సర్వే నిర్వహించలేదని, ఆ అసత్య కథనం తమది కాదని 'లోక్ నీతి- సీఎస్డీఎస్' ఆ తర్వాత ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’కి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు పంపినట్టు సమాచారం. ‘లోక్ నీతి-సీఎస్డీఎస్’ సర్వే పేరిట అసత్య కథనం ప్రచారం చేసిన విషయమై 14 రోజుల్లోగా తమకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ప్రెస్ కౌన్సిల్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.  

More Telugu News