sai dharam tej: వరుస పరాజయాలున్నా ఈ నిర్మాతలు నన్ను నమ్మారు: సాయిధరమ్ తేజ్

  • విజయ్ కృష్ణ పాత్రలో కనిపిస్తాను
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  •  సునీల్ తో చేయాలనే ముచ్చట తీరింది  

సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' నిర్మితమైంది. ఈ సరికొత్త ప్రేమకథా చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను విజయ్ కృష్ణ అనే పాత్రలో కనిపిస్తాను. జీవితంలో సక్సెస్ ను సాధించడం కోసం హీరో ఎన్ని కష్టాలను అధిగమించాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది.

కిషోర్ తిరుమల చెప్పిన కథ వినగానే .. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనిపించింది .. ఆ నమ్మకంతోనే చేశాను. ఇక వరుస పరాజయాలతో వున్న నన్ను నమ్మి ఈ సినిమా నిర్మాతలు అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందనే అనుకుంటున్నాను. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి మరో పిల్లర్ లా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక సునీల్ తో కలిసి నటించాలనే ముచ్చట ఈ సినిమాతో తీరినందుకు ఆనందంగా వుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News