Lakshmi's NTR: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను వీక్షిస్తున్న న్యాయమూర్తులు.. మరికాసేపట్లో విడుదలపై స్పష్టత

  • రాజకీయ లబ్ది కోసమే విడుదల అంటూ పిటిషన్
  • పిటిషన్లపై విచారణ నిర్వహించిన ధర్మాసనం
  • సినిమాను తాము వీక్షించాలన్న జడ్జిలు

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఏపీలో విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి విదితమే. ఈ పిటిషన్లపై జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, ఏవీ శేషసాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సినిమాను తాము చూడాలని ధర్మాసనం ఆదేశించడంతో నేడు న్యాయమూర్తుల ఛాంబర్‌లో ప్రొజక్షన్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను జడ్జిలతో పాటు న్యాయవాదులు వీక్షిస్తున్నారు. అనంతరం సినిమా విడుదలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

More Telugu News