Google Pay: ‘గూగుల్‌ పే’కు రిజర్వ్ బ్యాంక్ గుర్తింపు లేదంటూ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు

  • పిటిషన్ దాఖలు చేసిన అభిజిత్ మిశ్రా
  • కేంద్ర బ్యాంకు నుంచి ధ్రువీకరణ లేదు
  • పిటిషన్‌పై స్పందించాలని నోటీసులు

ఇప్పుడు నగదు బదిలీకి పలు యాప్‌లు అందుబాటులో వున్నాయి. దీంతో నగదు బదిలీ క్షణాల్లో జరిగిపోతోంది. ఈ నగదు బదిలీ యాప్‌లలో ఎక్కువ శాతం మంది ‘గూగుల్‌ పే’ను అనుసరిస్తున్నారు. అయితే దీనిని రిజర్వ్ బ్యాంక్ మాత్రం ధ్రువీకరించలేదని తాజాగా వెల్లడైంది. ‘గూగుల్‌ పే’ యాప్‌పై అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదని, పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, ఈ ఏడాది మార్చి 20న ఆర్‌బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలోనూ ‘గూగుల్‌ పే’ లేదని మిశ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అధికారిక ధ్రువీకరణ లేకుండా కార్యకలాపాలను ఎలా సాగిస్తోందని ఆర్‌బీఐని ప్రశ్నించింది. మిశ్రా పిటిషన్‌పై స్పందించాలంటూ ఆర్‌బీఐ, గూగుల్ ఇండియాకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

More Telugu News