chiranjeevi: 'సైరా' విషయంలో చరణ్ .. సురేందర్ రెడ్డి అలా చేస్తున్నారట

  • షూటింగు దశలో 'సైరా'
  • అనవసర సన్నివేశాల తొలగింపు
  •  ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదల    

చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' నిర్మితమవుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ .. సురేందర్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ అనవసరమైన సన్నివేశాలను .. అంటే అంతగా ప్రాధాన్యత లేని సన్నివేశాలను తొలగిస్తూ వస్తున్నారట.

షెడ్యూల్ .. షెడ్యూల్ కి మధ్య ఈ విషయంపైనే ఈ ఇద్దరూ దృష్టి పెడుతున్నారట. ఈ విధంగా చేయడం వలన అనవసరమైన ఖర్చు పెరగకుండా ఉంటుందనీ, సినిమా నిడివిని పెంచుతూ వెళ్లి చివర్లో తగ్గించే పని పెట్టుకోకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అమితాబ్ .. జగపతిబాబు .. సుదీప్ .. విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 

More Telugu News