MS Dhoni: ఎయిర్ పోర్టులో నేలపైనే పడుకుని నిద్రపోయిన ధోనీ, సాక్షి!

  • నిన్న రాత్రి మ్యాచ్ తరువాత ఎయిర్ పోర్టుకు చెన్నై టీమ్
  • తగినంత విశ్రాంతి లేక నేలపైనే పడుకున్న సాక్షి, ధోనీ
  • వైరల్ అవుతున్న ఫోటో

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ సింప్లిసిటీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ధోనీ, తన భార్యతో కలిసి చెన్నై ఎయిర్ పోర్టులో నేలపైనే నిద్రించగా, ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నిన్న రాత్రి, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే.

ఆపై రెండు రోజుల వ్యవధిలోనే అంటే గురువారం నాడు జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై ఆడాల్సివుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు హడావుడిగా ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానం రావడానికి సమయం ఉండటంతో, అప్పటికే విశ్రాంతి లేని ధోనీ నేలపైనే పడుకుని కునుకుతీశారు. భర్తను ఆనుసరించిన సాక్షి, అతని పక్కనే పడుకుని నిద్రపోయింది. ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు కుర్చీల్లో కూర్చుని సేదదీరుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్, ధోనీకి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన చాలా సింపుల్ గా ఉంటారని మరోసారి ప్రూవ్ అయిందని కామెంట్లు పెడుతున్నారు.

More Telugu News