Lakshmi's NTR: ఈ వారంలోనే ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్': రామ్ గోపాల్ వర్మ

  • రేపటితో పూర్తి కానున్న ఏపీ ఎన్నికల ప్రక్రియ
  • ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో గత నెలలోనే విడుదల
  • నేడు తీర్పివ్వనున్న హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లో ఈ వారంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల అవుతుందని దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. కాగా, ఏపీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం గత నెల 29న విడుదలైన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఎన్నికలు రేపటితో ముగియనుండటంతో, ఆ వెంటనే సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు వర్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ యూ దుర్గా ప్రసాదరావులతో కూడిన ధర్మాసనం తిలకించి తీర్పును ఇవ్వనుంది.




More Telugu News