Kurnool District: బనగానపల్లెలో ఉద్రిక్తత..టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడి!

  • స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఘటన
  • పరస్పరం రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గీయులు
  • టీడీపీ కార్యకర్తకు గాయాలు

కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడి చేసినట్టు సమాచారం. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త గోపాల్ గాయపడినట్టు తెలుస్తోంది. ఇరు వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలపైన లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. 

More Telugu News