sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • చివరి ఘడియల్లో పుంజుకున్న మార్కెట్లు
  • 239 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 67 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు  భారీ లాభాల్లో ముగిశాయి. మధ్యాహ్నం వరకు ఒడిదుడుకుల్లో ఉన్న మార్కెట్లు చివరి ఘడియల్లో పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 38,939కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 11,671 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (4.08%), టాటా మోటార్స్ (2.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.52%), బజాజ్ ఆటో (2.19%), కోల్ ఇండియా (2.12%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-3.54%), ఇన్ఫోసిస్ (-0.95%), భారతీ ఎయిర్ టెల్ (-0.76%), బజాజ్ ఫైనాన్స్ (-0.48%), ఓఎన్జీసీ (-0.35%).

More Telugu News