Guntur District: టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ వాహనాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు

  • గుంటూరు జిల్లా బాపట్లలో స్వల్ప ఉద్రిక్తత
  • వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ఇంటి రోడ్డులో టీడీపీ ప్రచారం
  • పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం

గుంటూరు జిల్లా బాపట్లలోని చిల్లర గొల్లపాలెంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థి అన్నం సతీశ్ ప్రభాకర్ వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి ఇంటి రోడ్డులో ప్రచారం నిమిత్తం సతీశ్ ప్రభాకర్ వెళ్లారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం  చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

More Telugu News