gvl: జీవీఎల్ కు, కేఏ పాల్ కు మధ్య తేడా లేదు: సీఎం రమేష్

  • జీవీఎల్ ఒక బ్రోకర్, జోకర్
  • అబద్ధాలు చెప్పడంలో జీవీఎల్ ను మించినవారు లేరు
  • ఆయన వైసీపీ కండువా వేసుకోవడమే తక్కువ

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ విమర్శలు గుప్పించారు. జీవీఎల్ ఒక బ్రోకర్, ఒక జోకర్ అని వ్యాఖ్యానించారు. జీవీఎల్ కు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కు ఎలాంటి తేడా లేదని అన్నారు. అబద్ధాలు చెప్పడంలో జీవీఎల్ ను మించినవారు లేదని విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఒక్క చోటైనా డిపాజిట్ వస్తుందా? అని ప్రశ్నించారు. జీవీఎల్ వైసీపీ కండువా వేసుకోవడమే తక్కువని ఎద్దేవా చేశారు.

More Telugu News