Telangana: ఎన్నికల ఎఫెక్ట్.. హైదరాబాద్ లో రూ.2.4 కోట్లను పట్టుకున్న పోలీసులు!

  • నగరంలోని లంగర్ హౌస్ లో ఘటన
  • ఈరోజు సోదాలు నిర్వహించిన అధికారులు
  • కారు జప్తు, ఆరుగురు నిందితుల అరెస్ట్

సార్వత్రిక ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలోని హైదరాబాద్ లో ఈరోజు భారీగా నగదు బయటపడింది. నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఓ కారులో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరించడంతో సదరు వాహనంలో సోదాలు చేపట్టారు.

దీంతో కారులో దాచిన రూ.2.4 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో వెళుతున్న ఆరుగురిని అరెస్ట్ చేయడంతో పాటు కారును సీజ్ చేశారు. ఈ నగదును ఎవరు పంపారు? ఎవరికి అందించేందుకు తీసుకెళుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News