Maharshi: వంశీ పైడిపల్లి భార్య పుట్టిన రోజు వేడుక... మహేశ్, తారక్ ల సందడి!

  • 'మహర్షి' ప్రమోషన్ లో మహేశ్ బాబు
  • జీవిత భాగస్వాములతో కలిసి హాజరైన మహేశ్, ఎన్టీఆర్
  • పుట్టిన రోజు పార్టీలో సందడే సందడి

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు, ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాను పూర్తి చేసుకుని, ప్రమోషన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నాడు. తాజాగా వంశీ భార్య మాలిని పుట్టినరోజు జరుగగా, ఈ పార్టీలో తారల సందడి కనిపించింది. మహేశ్ తన భార్య నమ్రతతో కలిసి ఈ పార్టీకి హాజరు కాగా, ఎన్టీఆర్ సైతం తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి పార్టీకి హాజరై, మాలినికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇద్దరు స్టార్ హీరోల రాకతో ఈ పార్టీ మరింత జోరుగా సాగింది. గతంలో ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో 'బృందావనం' విడుదలైన సంగతి తెలిసిందే. మాలిని పుట్టిన రోజు సందర్భంగా వీరంతా కలిసి దిగిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దాన్ని మీరూ చూడవచ్చు.

More Telugu News