Tirupati: దాదర్ రైల్వే స్టేషన్‌లో తిరుపతి వజ్ర కిరీటాల దొంగ అరెస్ట్!

  • ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన అధికారులు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
  • నిందితుడి కదలికలపై నిఘా
  • పూర్తి విచారణ నిర్వహించనున్న పోలీసులు

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో రెండు నెలల క్రితం వజ్రాలు పొదిగిన మూడు కిరీటాలు చోరీకి గురైన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తిరుపతి పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఏడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి దొంగతనం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆలయంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని గుర్తించి, అతనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఆ వ్యక్తిని మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అతడి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో నిందితుడు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు నేడు దాదర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. తిరుపతికి తీసుకొచ్చి పూర్తి స్థాయి విచారణ నిర్వహించనున్నారు.

More Telugu News