nagababu: 'జబర్దస్త్' కామెడీ షోకి దూరంగా నాగబాబు .. రోజా?

  • 'జబర్దస్త్' కామెడీ షోకి మంచి పాప్యులారిటీ
  •  న్యాయనిర్ణేతలుగా నాగబాబు .. రోజాలకి క్రేజ్
  •  శేఖర్ మాస్టర్ .. మీనాలకి భారీ పారితోషికం

ఈటీవీలో చాలా కాలంగా 'జబర్దస్త్' కామెడీ షో రన్ అవుతోంది. మంచి రేటింగుతో ఈ షో  కొనసాగుతోంది. ఈ షో ఇంతటి పాప్యులారిటీని సంపాదించుకోవడంలో నాగబాబు - రోజా ప్రధానమైన పాత్రను పోషించారని చెప్పాలి. ఈ కామెడీకి న్యాయనిర్ణేతలుగా వాళ్లు షోను రక్తికట్టించారు. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నాగబాబు .. రోజా ఇద్దరూ కూడా బిజీగా వున్నారు.'జనసేన' పార్టీ తరఫున ప్రచారం చేస్తోన్న నాగబాబు, తరువాత కూడా ఆ పార్టీ వ్యవహారాల్లో చురుకైన పాత్రను పోషించనున్నారు. అందువలన ఇక ఆయన 'జబర్దస్త్' షోలో కనిపించే అవకాశాలు తక్కువని అంటున్నారు. ఇక రోజా కూడా పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించనుందట. అందువలన ఆమె రాక కూడా సందేహమేనని చెబుతున్నారు. ఈ కారణంగానే క్రితం వారం నాగబాబు స్థానంలో శేఖర్ మాస్టర్ ను .. రోజా స్థానంలో మీనాను రంగంలోకి దింపారు. ఇక ఈ ఇద్దరే న్యాయనిర్ణేతలుగా కొనసాగనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఇద్దరికీ కూడా భారీ పారితోషికం ముడుతున్నట్టుగా సమాచారం. 

More Telugu News