Prakasam District: టీడీపీ నేతలు బడా బాబులుగా తయారయ్యారు: జీవీఎల్

  • ఏపీలో ఐదేళ్ల పాలన అవినీతిమయం
  • ఏపీ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది
  • ఏపీలో అన్ని స్కీమ్ ల్లోనూ స్కామ్ లే

బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మరోమారు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలే ఐటీ దాడులు చేయించుకుని డ్రామాలాడుతున్నారని, ప్రత్యేక హోదా అనేది అంతరించిన అంశం అని, లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీకి రూ.22,130 కోట్లు ఇచ్చామని, ప్రత్యేక ప్యాకేజ్ కింద రూ.17,500 కోట్లు ఇచ్చామని అన్నారు.

గత పాలకులు ప్రకాశం జిల్లా పట్ల పూర్తిగా వివక్ష చూపించారని విమర్శించారు. ఏపీలో ఐదేళ్ల పాలన అవినీతిమయం అన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోందని, ఎందుకంటే, ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, అడ్డగోలుగా అన్ని స్కీమ్ ల్లోనూ స్కామ్ లు చేసి, బడా బాబులుగా టీడీపీ నేతలు తయారయ్యారని ఆరోపించారు. ఏపీలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రప్రభుత్వం చలువేనని అన్నారు. పేద ప్రజల కోసం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన స్టిక్కర్ వేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు 'ఓ స్టిక్కర్ బాబు’ అని విమర్శించారు.  

More Telugu News