sai tej: 'చిత్రలహరి' సెన్సార్ పూర్తి .. విడుదలకి రంగం సిద్ధం

  • 'చిత్రలహరి'కి క్లీన్ 'యు' సర్టిఫికెట్ 
  • ముఖ్యమైన పాత్రలో సునీల్ 
  • ఈ నెల 12వ తేదీన విడుదల    

సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా 'చిత్రలహరి' నిర్మితమైంది. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. ఈ సారి కూడా ఆయన ఓ అందమైన ప్రేమకథనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నాడు.

 తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, క్లీన్ 'యు' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఎక్కడా ఒక కత్తెర కూడా పడకుండా ఈ సినిమా బయటికి రావడం విశేషం. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో సునీల్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సాయితేజ్ కి మాత్రమే కాదు .. కల్యాణి ప్రియదర్శన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి.

More Telugu News