KA Paul: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినంతమాత్రాన జగన్ సీఎం కావాలనుకోవడం సరికాదు: కేఏ పాల్

  • జగన్ సీఎం అయితే రాష్ట్రం రావణకాష్టం అవుతుంది
  • జగన్ లాంటి వాళ్లు జైల్లోనే ఉండాలి
  • నాపై దాడులకు జగన్ గ్యాంగ్ కారణం

ప్రముఖ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు అయినంతమాత్రాన జగన్ సీఎం కావాలనుకోవడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి అవడానికి తగిన అర్హతలు జగన్ కు ఏం ఉన్నాయని ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొంటాయని, జగన్ లాంటి అవినీతిపరుడు జైల్లో ఉంటేనే ప్రజలకు మంచిదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంపై గౌరవం ఉన్నవాళ్లు పొరబాటున కూడా జగన్ కు ఓటేయరాదని సూచించారు.

తనపై ఎప్పటినుంచో జగన్ గ్యాంగ్ దాడులకు పాల్పడుతోందని ఆరోపించిన కేఏ పాల్, గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి జగన్ తనను జైల్లో పెట్టించాడని వాపోయారు. తనపై హత్యాప్రయత్నం కూడా చేశారని తెలిపారు. జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడాన్ని బైబిల్ కూడా అంగీకరించదని పేర్కొన్నారు.

More Telugu News