saitej: తేజు సెంటిమెంట్ కోసం అంత ఖర్చు చేశారట

  • అందమైన ప్రేమకథగా 'చిత్రలహరి'
  • ఈ నెల 12వ తేదీన భారీ విడుదల
  •  సాయితేజ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే    

సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ జంటగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' నిర్మితమైంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాదులోని శిల్పకళావేదికలో జరిగింది. అసలు మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ వేడుకను 'జేఆర్సీ కన్వెన్షన్'లో జరపాలనుకున్నారట. అక్కడైతే కాస్త తక్కువ ఖర్చుతో ఈ వేడుక పూర్తవుతుంది.

అయితే సాయితేజ్ మాత్రం శిల్పకళా వేదికలోనే ఈ సినిమా ఆడియో వేడుక జరపమని రిక్వెస్ట్ చేశాడట. అక్కడ ఆడియో వేడుక జరుపుకున్న తన సినిమాలు సక్సెస్ అయ్యాయనీ .. అది తన సెంటిమెంట్ అంటూ ఒక తీరుగా చెప్పాడట. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ వారు అందుకు అంగీకరించి, ఈ వేడుకను శిల్పకళా వేదికలోనే నిర్వహించారు. ఈ వేడుకను ఇక్కడ జరపడం వలన, నిర్మాతలకి అదనంగా 9 లక్షలు ఖర్చు అయిందని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ కోసమే సాయితేజ్ వేయికళ్లతో వెయిట్ చేస్తున్నాడు. 

More Telugu News