Nara Lokesh: బ్రాహ్మణికి రూ. 500 ఇచ్చిన అవ్వ... వీడియో పోస్ట్ చేసిన లోకేశ్!

  • టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆశీర్వాదం
  • ఎన్నికల ఖర్చు కోసం పెన్షన్ నుంచి డబ్బు
  • ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్న లోకేశ్

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువనేత నారా లోకేశ్ కు మద్దతుగా ఆయన భార్య బ్రాహ్మణి ప్రచారం నిర్వహించిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఓ అవ్వ తనకు వచ్చిన పెన్షన్ నుంచి రూ. 500 బ్రాహ్మణికి అందించి, ఆశీర్వదించింది. ఇందుకు సంబంధించిన వీడియోను లోకేశ్, తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. "తెలుగుదేశం పార్టీ విజయంకోసం మంగళగిరిలో నారా బ్రాహ్మణి  ప్రచారం చేస్తుండగా, ఈ అవ్వ మాట్లాడుతూ తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశీర్వదిస్తూ, ఎన్నికల ఖర్చుల కోసం తన పెన్షన్ నుంచి రూ.500 ఇచ్చింది. అవ్వ ఆశీర్వాదం ఫలిస్తుంది, ప్రజల ఆకాంక్షలు తప్పక నెరవేరతాయి" అని వ్యాఖ్యానించారు.

More Telugu News