Uttar Pradesh: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీవ్రవాదులకు వేసినట్టే: యూపీ సీఎం యోగి

  • దేశానికి వ్యతిరేకంగా పని చేసే పార్టీలకు బుద్ధి చెప్పాలి
  • తీవ్రవాదులకు బిర్యానీ పొట్లాలిచ్చింది ‘కాంగ్రెస్’
  • బీజేపీ ప్రభుత్వం బుల్లెట్లతో వారికి సమాధానమిచ్చింది

దేశానికి వ్యతిరేకంగా పని చేసే పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణలోని పెద్దపల్లిలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో  ఆయన మాట్లాడుతూ, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత బీజేపీదేనని గర్వంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రవాదులకు బిర్యానీ పొట్లాలు అందిస్తే, బీజేపీ ప్రభుత్వం బుల్లెట్లతో వారికి సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేస్తే ఎంఐఎంకు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీవ్రవాదులకు వేసినట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News