YSRCP: నేటి ఉదయం 10 గంటలకు వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేయనున్న జగన్

  • తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో విడుదల
  • అంతకంటే ముందు పంచాంగ శ్రవణం
  • గత నెలలోనే విడుదల కావాల్సిన మేనిఫెస్టో వాయిదా

వచ్చే వారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటి ఉదయం 10 గంటలకు వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచనుంది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. నిజానికి వైసీపీ తన మేనిఫెస్టోను గత నెలలోనే విడుదల చేయాల్సి ఉండగా వాయిదా పడింది. కాగా, మేనిఫెస్టో విడుదలకు ముందు పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుందని వైసీపీ నేతలు తెలిపారు.

More Telugu News