Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో భారీగా నగదు స్వాధీనం.. బస్సులోని 30 మంది పోలీస్ స్టేషన్ కు తరలింపు!

  • బస్సులో పాలకొండ వైసీపీ నేత తనయుడు
  • నగదు రూ.కోటి వరకూ ఉండొచ్చని అంచనా
  • అందరినీ విచారిస్తున్న రాజాం పోలీసులు

సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు భారీగా నగదు బయటపడింది. జిల్లాలోని రాజాం మండలం బొద్దాం వద్ద ఓ ఆర్టీసీ బస్సులో మూడు బ్యాగుల్లో పెద్దఎత్తున తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం నగదు సుమారు రూ.కోటి వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.

ఈ బస్సు శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళుతుండగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను రాజాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ఈ నగదును ఎవరు తరలిస్తున్నారు? అని అందరినీ విచారిస్తున్నారు. కాగా, ఇదే బస్సులో పాలకొండకు చెందిన వైసీపీ నేత తనయుడు విక్రాంత్ ఉండటంతో ఆయన్ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

More Telugu News