Telugudesam: ఈ ముగ్గురూ కలిసి ఏపీపై ముప్పేట దాడి చేస్తున్నారు: మంత్రి యనమల

  • మోదీకి కేసీఆర్, జగన్ లు కుడి, ఎడమ భుజాలు
  • జగన్ కు ఓటేస్తే ఏపీపై పెత్తనం కేసీఆర్ కు ఇచ్చినట్టే
  • బీజేపీ, వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు

మోదీ, కేసీఆర్, జగన్.. ఈ ముగ్గురూ కలిసి ఏపీపై ముప్పేట దాడి చేస్తున్నారని మంత్రి యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీకి కేసీఆర్, జగన్ లు కుడి, ఎడమ భుజాలతో సమానమని అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేస్తే ఏపీపై పెత్తనం కేసీఆర్ కు ఇచ్చినట్టే అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతలపై మోదీ దాడులు చేయిస్తున్నారని, ఈ కుట్రలకు బీజేపీ, వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాల అమలు చేయడం టీడీపీకే సాధ్యమని అన్నారు. 

More Telugu News