Mahesh Babu: 'మహర్షి' నుంచి ఉగాది కానుకగా టీజర్

  • వంశీ పైడిపల్లి నుంచి 'మహర్షి'
  • ఈ నెల 6వ తేదీన టీజర్ రిలీజ్ 
  • మే 9వ తేదీన సినిమా విడుదల  

మహేశ్ బాబు కథానాయకుడుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' నిర్మితమవుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, మే 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక 'ఉగాది' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ శనివారం అంటే 6వ తేదీ ఉదయం 9గంటల 9 నిమిషాలకి టీజర్ ను వదలనున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్ .. శాటిలైట్ రైట్స్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ భారీరేటుకు అమ్ముడయ్యాయి. ఏరోజుకారోజు సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు ఖాతాలో మరో హిట్ చేరిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అభిమానుల అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి. 

More Telugu News