Pakistan: పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చివేసిన బీఎస్ఎఫ్ జవాన్లు.. హైఅలర్ట్

  • నిన్న రాత్రి పంజాబ్ సరిహద్దుల్లో ఎగురుతున్న పాక్ డ్రోన్
  • యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో కూల్చివేసిన బీఎస్ఎఫ్
  • సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్

భారత గగనతలంలో ఎగురుతున్న పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చి వేశారు. పంజాబ్ లోని ఖేమ్ కరర్ సెక్టార్ లో ఎగురుతున్న డ్రోన్ గుర్తించిన బలగాలు... క్షణాల్లోనే దాన్ని కూల్చి వేశాయి. ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్ ను ప్రకటించారు.

రతోకే గ్రామంలో నిన్న రాత్రి డ్రోన్ ఎగురుతుండగా బీఎస్ఎఫ్ దాన్ని పసిగట్టింది. వెంటనే యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో దానిపై కాల్పులు జరిపింది. డ్రోన్ కూలిపోయినప్పటికీ.... అది భారత భూభాగంలో పడిపోయిందా? లేక పాక్ భూభాగంలో పడిపోయిందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

More Telugu News