saitej: 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ వేడుక తేదీ ఖరారు

  • కిషోర్ తిరుమల నుంచి 'చిత్రలహరి'
  • ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల    

ప్రేమకథా చిత్రాలతో కుర్రకారును మెప్పించే దర్శకుడిగా కిషోర్ తిరుమలకి మంచి పేరుంది. ఆయన తాజా చిత్రంగా 'చిత్రలహరి' నిర్మితమైంది. సాయితేజ్ .. కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపడానికి రంగంలోకి దిగింది.

ఈ నెల 6వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం ఆ దిశగా చకచకా సన్నాహాలు జరిగిపోతున్నాయి. ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారనేది తెలియనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే ఆశాభావంతో సాయితేజ్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News