Vijayawada: గతంలోనే ఈ కేసు కొట్టేశారు.. ఉద్దేశపూర్వకంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: వల్లభనేని వంశీ

  • ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టి వేసింది
  •  నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతి ఉంది
  • ఈ ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తా

2009లో ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి ఏపీ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయమై వంశీ మాట్లాడుతూ, ఈ కేసును 2013లోనే హైకోర్టు కొట్టి వేసిందని, ఇప్పుడు తనను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి నాడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని నాంపల్లి కోర్టుకు నివేదిస్తానని ఆయన చెప్పారు.

More Telugu News