Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

  • 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు
  • ఈ కేసుపై హైదరాబాద్ నాంపల్లి కోర్టులో విచారణ
  • విచారణకు హాజరు కాకపోవడంతో వంశీకి వారెంట్ జారీ

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2009లో వంశీపై ఆయుధాల చట్టం కింద నమోదైన కేసుకు సంబంధించి హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. గతంలో తనకు ప్రభుత్వ రక్షణ వద్దంటూ ప్రైవేట్ భద్రతను వంశీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వంశీ వద్ద అక్రమ ఆయుధాలు లభించాయని ఆయనపై అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు వంశీ హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీ చేసింది. 

More Telugu News