kumaraswamy: కుమారస్వామి వాహనాన్ని ఆపి.. తనిఖీ చేసిన ఈసీ స్క్వాడ్

  • ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు
  • బెంగళూరు నుంచి హాసన్ వెళ్తుండగా కాన్వాయ్ ను ఆపిన అధికారులు
  • కారులో ముందు సీట్లో కూర్చున్న కర్ణాటక సీఎం

ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చెకింగ్ బృందాలు ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వాహనాన్ని కూడా తనిఖీ చేశాయి. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు నుంచి హాసన్ కు కుమారస్వామి వెళ్తుండగా ఆయన కాన్వాయ్ ను ఈసీ స్క్వాడ్ ఆపింది. వాహనాన్ని తనిఖీ చేస్తామని తెలిపింది. దీంతో, తనిఖీ చేసుకోవాలంటూ వారికి కుమారస్వామి చెప్పారు. ఈ తనిఖీలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనిఖీల సందర్భంగా తన వాహనంలో ముందు వైపున కుమారస్వామి కూర్చొని ఉండటం కనిపిస్తుంది.

More Telugu News