Andhra Pradesh: ఏపీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ సర్వే పేరిట తప్పుడు ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు!

  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదు
  • తమ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని వ్యాఖ్య
  • నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామన్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై తాము సర్వే చేసినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఆరోపించారు. ఈ ప్రచారానికి పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తాము సర్వేలు చేసినట్లు తప్పుడు ఫలితాలను సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ అధికారుల ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా ఈ ఘటన వెనకున్న నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News