Telangana: ‘రైతు బంధు’ డబ్బులు ఇవ్వలేదో.. లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తాం!: నిజామాబాద్ రైతుల వార్నింగ్

  • జిల్లాలోని కేశుపల్లి వాసుల అల్టిమేటం
  • ఇంకా రైతులకు అందని రైతు బంధు చెక్కులు
  • అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం శూన్యం
  • రైతుల నిర్ణయంపై ఇంకా స్పందించని అధికారులు

రైతు బంధు చెక్కులు అందకపోవడంతో తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు చెక్కులను అందించకుంటే లోక్ సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే ఈ ఎన్నికల్లో ఓటేయబోమని స్పష్టం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో చోటుచేసుకుంది.

జిల్లాలోని కేశుపల్లి గ్రామ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు చెక్కులు అందలేదు. అధికారులను ఈ విషయమై పలుమార్లు కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో చివరికి విసిగిపోయిన గ్రామస్తులు లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని ఉమ్మడిగా నిర్ణయించారు. ఈ నెల 10లోగా రైతు బంధు చెక్కులు తమకు అందేలా చర్యలు తీసుకోవాలనీ, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.

More Telugu News