Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో నోట్ల కట్టలు.. ఓ హాస్టల్ లో రూ.70 లక్షలు స్వాధీనం చేసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్!

  • ప్రకాశం జిల్లాలోని చీరాలలో ఘటన
  • నగదు దాచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం
  • ఉదయాన్నే సోదాలు చేపట్టిన అధికారులు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో నగదు కట్టలుకట్టలుగా బయటపడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీగా నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని చీరాలలో ప్రసాదనగరంలో ఉన్న ఓ ప్రైవేటు హాస్టల్ లో నగదును దాచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ కు సమాచారం అందింది. దీంతో అధికారులు ఈరోజు ఉదయాన్నే హాస్టల్ లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా ఓ సంచిలో దాచిపెట్టిన రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు, హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తమిళనాడులోని పెరంబలూరులో ఈరోజు రూ.2.1 కోట్ల నగదును ఓ కారు డోరులో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News