mohan babu: మోహన్ బాబుకు బెయిల్ మంజూరు.. 30 రోజుల్లోగా డబ్బు చెల్లించాలంటూ ఆదేశం

  • చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష
  • 30 రోజుల్లోగా డబ్బు చెల్లిస్తానన్న మోహన్ బాబు
  • బెయిల్ మంజూరు చేసిన కోర్టు

మోహన్ బాబుకు హైదరాబాదులోని ఎర్రమంజిల్ కోర్టు షాకిచ్చిన సంగతి తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షను విధించింది. రూ. 41.75 లక్షలను చెల్లించాలంటూ ఆదేశించింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే జైలు శిక్షను మరో మూడు నెలలు పొడిగిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో, మోహన్ బాబు తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. 30 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో, మోహన్ బాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 30 రోజుల్లోగా దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరికి డబ్బును చెల్లించాలని ఆదేశించింది.

More Telugu News