Mahesh Babu: 'మహర్షి' కథ అక్కడే మలుపు తిరుగుతుందట!

  • మహేశ్ కథానాయకుడిగా 'మహర్షి'
  • స్నేహితుడి పాత్రలో 'అల్లరి' నరేశ్ 
  • మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు      

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడి పాత్రలో 'అల్లరి' నరేశ్ కనిపించనున్నాడు. 'అల్లరి' నరేశ్ తన గ్రామానికి చెందిన యువకుడిగా ఒక ఆశయ సిద్ధికోసం పోరాడి చనిపోతాడట. తన స్నేహితుడి 'కల'ను నిజం చేయడం కోసం కోట్ల రూపాయల ఆస్తులను వదులుకుని, ఆ స్నేహితుడి గ్రామానికి మహేశ్ బాబు వస్తాడట. అలా 'అల్లరి' నరేశ్ పాత్ర మరణంతో కథ కీలకమైన మలుపు తిరుగుతుందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతున్నదో తెలియాలంటే మే 9వ తేదీ వరకూ ఎదురుచూడవలసిందే.

More Telugu News