Jeevitha: వైఎస్ జగన్ ను కలిసిన జీవిత, రాజశేఖర్!

  • లోటస్ పాండ్ కు వచ్చిన సినీ దంపతులు
  • వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరికపై చర్చలు
  • ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న జీవిత, రాజశేఖర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ లు కలిశారు. ఈ ఉదయం లోటస్ పాండ్ లోని వైకాపా ప్రధాన కార్యాలయానికి వచ్చిన వీరు జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరి మధ్య జరిగిన చర్చల వివరాలు బయటకు వెల్లడి కానప్పటికీ, ఈ జంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆపై ఎన్నికల్లో ప్రచారం, తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వైసీపీ తరఫున వీరిద్దరూ ఏపీలో పర్యటించి, ఆ పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

కాగా, నేడు వైఎస్ జగన్ నాలుగు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది.

More Telugu News